Devi Sri Prasad : దేవిశ్రీప్రసాద్ ఒక్కో మూవీకి ఎన్ని కోట్ల రెమ్యూనిరేషన్ తీసుకుంటాడో తెలుసా..?

తెలుగు సినీ పరిశ్రమలో అత్యంత టాలెంట్ ఉన్న సంగీత దర్శకులలో ఒకరు అయినటువంటి దేవి శ్రీ ప్రసాద్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. దేవి శ్రీ ప్రసాద్ ఇప్పటికే ఎన్నో బ్లాక్ బస్టర్ మూవీ లకు సంగీతాన్ని అందించి తెలుగు సినిమా ఇండస్ట్రీలో సూపర్ క్రేజ్ ను సంపాదించుకున్నాడు. దేవి శ్రీ ప్రసాద్ కేవలం తెలుగు సినిమాలకు మాత్రమే కాకుండా ఇతర భాష సినిమాలకు కూడా సంగీతాన్ని అందించాడు.

 

ఇది ఇలా ఉంటే పోయిన సంవత్సరం దేవి శ్రీ ప్రసాద్ “పుష్ప ది రైస్” అనే మూవీ కి మ్యూజిక్ ను అందించాడు. ఈ మూవీ పాన్ ఇండియా రేంజ్ లో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అలాగే ఈ మూవీ లోని పాటలు కూడా అద్భుతమైన విజయాన్ని సాధించాయి. పుష్ప ది రైస్ మూవీ ద్వారా దేవి శ్రీ ప్రసాద్ పాన్ ఇండియా రేంజ్ లో అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకున్నాడు.

 

ఇది ఇలా ఉంటే దేవి శ్రీ ప్రసాద్ ప్రస్తుతం వాల్తేరు వీరయ్య మూవీ కి సంగీతం అందిస్తున్నాడు. చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న ఈ మూవీ లో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా , బాబీ ఈ మూవీ కి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ వచ్చే సంవత్సరం జనవరి 13 వ తేదీన విడుదల కాపుతుంది. ఇది ఇలా ఉంటే ఇప్పటికే దేవి శ్రీ ప్రసాద్ ఎన్నో మూవీ లకు అద్భుతమైన సంగీతాన్ని అందించి సినిమా విజయంలో కీలకపాత్రను పోషించిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఇది ఇలా ఉంటే దేవి శ్రీ ప్రసాద్ ఒక్కో మూవీ కి ప్రస్తుతం 4 కోట్ల వరకు రెమ్యూనిరేషన్ తీసుకుంటున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *