Chiranjeevi : చిరంజీవి “ఆచార్య” మూవీ కి ఎన్ని కోట్ల నష్టం వచ్చిందో తెలుసా..?

మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. చిరంజీవి ఇప్పటికే ఎన్నో బ్లాక్ బాస్టర్ మూవీ లలో హీరో గా నటించి ఎంతో మంది ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకున్నాడు. ఇది ఇలా ఉంటే కొన్ని సంవత్సరాల పాటు సినిమాలకు దూరంగా ఉండి రాజకీయాలపై దృష్టి పెట్టిన చిరంజీవి “ఖైదీ నెంబర్ 150” మూవీ తో తిరిగి సినిమా ఇండస్ట్రీ లోకి రీ ఎంట్రీ ఇచ్చాడు.

 

ఆ తర్వాత సైరా నరసింహా రెడ్డి అనే పాన్ ఇండియా మూవీ లో నటించాడు. ఇది ఇలా ఉంటే చిరంజీవి ఈ సంవత్సరం మొదటగా ఆచార్య మూవీ తో ప్రేక్షకులను పలకరించిన విషయం మన అందరికీ తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వంలో తేరకెక్కిన ఈ మూవీ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఒక కీలక పాత్రలో నటించాడు. పూజా హెగ్డే ఈ మూవీ లో రామ్ చరణ్ కి జోడిగా నటించగా , మణిశర్మ ఈ మూవీ కి సంగీతం అందించాడు.

 

మెగాస్టార్ చిరంజీవి , మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ “ఆచార్య” మూవీ లో ఫుల్ లెన్త్ రోల్ లో కలిసి నటించడంతో ఈ మూవీ పై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. దానితో ఈ మూవీ కి అదిరిపోయే రేంజ్ లో ఫ్రీ రిలీజ్ బిజినెస్ కూడా జరిగింది. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఆచార్య మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఘోరమైన నెగటివ్ టాక్ ను తెచ్చుకుంది. దానితో ఈ మూవీ కి బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ కలెక్షన్ లు దక్కలేదు. ఇది ఇలా ఉంటే ఆచార్య మూవీ కి దాదాపు 90 కోట్ల వరకు నష్టం వచ్చినట్లు తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *