Ananya Pandey : టైగర్ ఫ్లాప్ తో అనన్యకు కోలుకోలేని దెబ్బ… రెమ్యునరేషన్ ఎంత తగ్గిందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే…?

విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాత్ దర్శకత్వంలో వచ్చిన సినిమా లైగర్. ఈ సినిమాను పాన్ ఇండియా లెవల్లో పూరి జగన్నాథ్, ఛార్మీ, కరణ్ జోహార్ తో సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమా రెండేళ్ల పాటు చిత్రీకరణ జరుపుకుంది. కాగా తెలుగు సినిమాల హవా కొనసాగుతూ ఉండటం… సినిమాలో బాలీవుడ్ నిర్మాత డబ్బులు పెట్టడం మరియు అనన్య పాండే హీరోయిన్ గా నటించడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలను నెలకొన్నాయి.

 

అంతేకాకుండా సినిమా ప్రమోషన్స్ లో విజయ్ దేవరకొండ యాటిట్యూడ్ చూసి ఈ సినిమా ఖచ్చితంగా హిట్ పడుతుందని ….విజయ్ దేవరకొండకు ఇది మరో అర్జున్ రెడ్డి అవుతుందని అంతా అనుకున్నారు. మరోవైపు ఈ సినిమాలో హాలీవుడ్ నటుడు మైక్ టైసన్ సైతం ముఖ్యమైన పాత్రలో నటించాడు. అయితే భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మాత్రం అట్టర్ ఫ్లాప్ అయ్యింది. ఈ సినిమాతో నిర్మాతలకు భారీ నష్టాలు వచ్చాయి.

 

అంతేకాకుండా ఈ సినిమా తర్వాత పూరి జగన్నాథ్ విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో రావాల్సిన వందేమాతరం సినిమా సైతం ఆగిపోయిందని వార్తలు వినిపించాయి. ఇదిలా ఉంటే ఈ సినిమా ఎఫెక్ట్ హీరోయిన్ అనన్య పాండే పై సైతం గట్టిగా పడినట్టు తెలుస్తోంది. ఈ సినిమా కంటే ముందు అనన్య తీసుకున్న రెమ్యూనరేషన్ లో లై తర్వాత 40 శాతం వరకు తగ్గిందని బాలీవుడ్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. మరోవైపు అనన్య పాండే ఈ సినిమాతో హాలీవుడ్ కు వెలతా అంటూ చేసిన కామెంట్లపై సైతం ట్రోల్స్ వస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *