PRABHAS: రిపీట్ కాబోతున్న వర్షం కాంబో…?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ప్రభాస్ ప్రస్తుతం ఆది పురుష్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా టీజర్ కూడా విడుదల అయింది. ఈ సినిమా కూడా విడుదలకు సిద్ధంగా ఉంది. ఇదిలా ఉండగానే ప్రభాస్ తన తదుపరి సినిమాను మహానటి దర్శకుడితో చేస్తున్నాడు. ఈ సినిమా ప్రాజెక్ట్ కే అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతోంది.

 

ఈ సినిమాలో ప్రభాస్ కు జోడిగా బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే హీరోయిన్ గా నటిస్తోంది. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరెకెక్కుతోంది. పాన్ ఇండియా లెవెల్ లో ఈ సినిమా వస్తుంది. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే భారీ చిత్రాలు చేస్తున్న ప్రభాస్ ఓ లవ్ స్టోరీ లో నటిస్తున్నాడు అంటూ వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. ప్రభాస్ మారుతి కాంబినేషన్ లో ఓ సినిమా రాబోతుంది.

 

అయితే ఆ సినిమాలో హీరోయిన్ గా త్రిష నటించబోతున్నట్టు టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే ప్రభాస్ త్రిష కాంబినేషన్ లో వర్షం, బుజ్జిగాడు సినిమాలు వచ్చాయి. వర్షం సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. బుజ్జిగాడు సినిమా ప్రభాస్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇక మారుతి కాంబినేషన్ లో రాబోతున్న సినిమాలో కూడా త్రిష నటించబోతుంది అంటూ టాక్ వినిపిస్తోంది. త్రిష 86 సినిమాతో సౌత్ లో ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. ముఖ్యంగా తమిళ్ లో ఈ అమ్మడి క్రేజ్ లో రేంజ్ లో ఉంది. కాబట్టి త్రిష క్రేజ్ ను క్యాష్ చేసుకోవడం కోసమే మేకర్స్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు టాక్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *