Actress Jayasudha: శోభన్ బాబు చెప్పిన మాట లెక్క చేయకపోవడం వల్ల కోట్లు నష్టపోయిన జయసుధ….! ఆయన ఏం చెప్పారంటే…?

టాలీవుడ్ లో ఒకప్పుడు స్టార్ హీరోలుగా రాణించిన వారిలో శోభన్ బాబు కూడా ఒకరు. ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలతో శోభన్ బాబు ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చిన శోభన్ బాబు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలలో నటించి ఆ తర్వాత హీరోగా అవకాశాలు అందుకున్నారు. ముఖ్యంగా కుటుంబ కథా చిత్రాలలో నటించి ఫ్యామిలీ ఆడియన్స్ కు దగ్గరయ్యారు. టాలీవుడ్ లో సోగ్గాడిగా ఆయన పేరు సంపాదించుకున్నారు.

 

ఇండస్ట్రీలో కష్టపడి ఎదిగిన శోభన్ బాబు చాలా డీసెంట్ గా ఉండేవారు. ఎలాంటి చెడు అలవాట్లకు బానిసవ్వకుండా క్రమశిక్షణతో మెలిగేవారు. అంతేకాకుండా శోభన్ బాబు డబ్బు విషయంలోనూ చాలా జాగ్రత్తగా వ్యవహరించేవారు. సంపాదించిన డబ్బు మొత్తం ఆయన భూములపై ఖర్చు చేసేవారు. అందువల్లే ఇప్పటికీ శోభన్ బాబు కుటుంబ సభ్యులకు చెన్నైలో వేలకోట్ల ఆస్తులు ప్రాపర్టీలు ఉన్నాయి.

 

తాను భూములపై పెట్టుబడి పెట్టడమే కాకుండా తన సన్నిహితులకు సైతం శోభన్ బాబు సలహాలు ఇచ్చేవారు. నిర్మాత నటుడు మురళీమోహన్ కు సైతం ఆయన సలహాలు ఇచ్చేవారట. శోభన్ బాబు సలహా మేరకే మురళీమోహన్ రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులు పెట్టి ప్రస్తుతం టాప్ పొజిషన్ లో ఉన్నారు. అయితే శోభన్ బాబు జయసుధ తో ఓ సినిమాలో నటిస్తున్న సమయంలో ఆవిడకి కూడా సూచించారట. ఓ రోజు షూటింగ్ కి వెళ్లి జయసుధ తో కలిసి కారులో వెళుతున్న సమయంలో ఓ స్థలాన్ని చూపించి…. మీ నాన్నగారితో మాట్లాడి ఈ స్థలాన్ని కొనుక్కోంది….అని సలహా ఇచ్చారట. అప్పుడు జయసుధ తన భర్త తో కలిసి ఆ స్థలాన్ని చూసి…. ఇది సిటీకి చాలా దూరంగా ఉందని అనుకున్నారట.

 

దీనిమీద పెట్టుబడి పెట్టమని సలహా ఇచ్చారు ఏంటి…? అని అనుకున్నారట. ఇక ఆ విషయాన్ని మర్చిపోయారట. ఆ స్థలం మద్రాస్ లో అందానగర్ లో ఉందని జయసుధ చెప్పారు. అయితే ఆ స్థలం ఇప్పుడు కోట్లు పలుకుతోందని అన్నారు. అప్పుడు శోభన్ బాబు చెప్పిన మాట విని పెట్టుబడులు పెట్టి ఉంటే చాలా బాగుండేదని అభిప్రాయపడ్డారు. అలా చేయకుండా సినిమాల్లో పెట్టుబడి పెట్టి చాలా నష్టపోయామని జయసుధ ఆవేదన వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *