PAVITRA LOKESH: ట్రోల్స్ పై పవిత్ర లోకేష్ సీరియస్… అల్లరి చేస్తున్నారంటూ పోలీసులకు ఫిర్యాదు…!

నటి పవిత్ర లోకేష్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. సోషల్ మీడియాలో తనను ట్రోల్ చేస్తున్నారని పవిత్ర లోకేష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నరేష్ తో లింక్ చేసి తనను దారుణంగా ట్రోల్ చేస్తున్నారని పవిత్ర లోకేష్ ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేకాకుండా చెప్పుకోలేని మాటలతో వేధిస్తున్నారని పేర్కొన్నారు. కొన్ని స్క్రీన్ షాట్లు…. సోషల్ మీడియా ఖాతాలతో పాటు యూట్యూబ్ ఛానల్ పేర్లను పవిత్ర లోకేష్ పోలీసులకు అందజేశారు.

ఇది ఇలా ఉంటే నటి పవిత్ర లోకేష్ నటుడు వి.కె నరేష్ తో డేటింగ్ లో ఉన్నారు అంటూ కొన్ని నెలలుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. దానికి తోడు పవిత్ర లోకేష్ నరేష్ కలిసి ఓ స్వామీజీ వద్దకు వెళ్లిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

 

అంతేకాకుండా ప్రస్తుతం ఇద్దరూ ఒకే ఇంట్లో కలిసి ఉంటారని కూడా టాలీవుడ్లో టాక్ వినిపిస్తోంది. ఇక కొద్ది రోజుల క్రితం నరేష్ మూడో భార్య పవిత్ర లోకేష్ నరేష్ లను ఓ హోటల్ లో చూసి వారితో వివాదానికి దిగారు. దానికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది. దాంతో కొద్ది రోజులుగా నరేష్ పవిత్ర లోకేష్ పై ఓ రేంజ్ లో ట్రోల్స్ వస్తున్నాయి ….ఇక వాటిని భరించలేక పవిత్ర లోకేష్ పోలీసులను ఆశ్రయించినట్లు తెలుస్తోంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *