Sirisilla kidnap case: ఎంగేజ్మెంట్ తరవాత కిడ్నాప్ ఇంతలో మరో యువకుడితో పెళ్లి….ఇది మామూలు ట్విస్ట్ కాదుగా…!

ఎంగేజ్మెంట్ జరిగిన మరుసటిరోజే యువతి కిడ్నాప్ అయ్యింది. ఇంతలోనే మరో యువకుడితో ఆమె వివాహం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా సంచనలం రేపిన ఈ కేసు వివరాల్లోకి వెళితే…. సిరిసిల్ల జిల్లాలోని చందుర్తి మండలం మాడుపల్లిలో శాలిని అనే యువతి రెండు రోజుల క్రితం కిడ్నాప్ అయ్యింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే శాలినికి సోమవారమే ఎంగేజ్మెంట్ జరిగింది.

కాగా మంగళవారం తెల్లవారుజామున తండ్రితో కలిసి గ్రామంలోని హనుమాన్ టెంపుల్ కి వెళ్లి పూజ చేస్తుండగా గుడిమందే నలుగురు యువకులు, కారులో వచ్చి శాలినిని కిడ్నాప్ చేశారు. అడ్డు వచ్చిన తండ్రిని పక్కకు నెట్టేసి యువతిని కిడ్నాప్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. ఆ తర్వాత వీడియో వైరల్ అయింది.

 

శాలిని తండ్రి చంద్రయ్య స్థానిక పోలీస్ స్టేషన్లో తన కూతురిని కిడ్నాప్ చేశారని ఫిర్యాదు చేశారు. దాంతో రంగంలోకి దిగిన పోలీసులు కేసు పై విచారణ ప్రారంభించారు. అయితే ఈ కిడ్నాప్ ఘటన సుఖాంతం అయింది. యువతిని కిడ్నాప్ చేసిన వ్యక్తి జ్ఞానేశ్వర్ గా తెలిసింది. కానీ ఇంతలోనే ఎవరూ ఊహించని ట్విస్ట్ నెలకొంది.

 

శాలిని తాను జ్ఞానేశ్వర్ ను నాలుగేళ్లుగా ప్రేమిస్తున్నానని చెప్పింది. కానీ తమ పెళ్ళికి పెద్దలు ఒప్పుకోలేదని వెల్లడించింది. ఇంట్లో ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారని ప్రియుడి తో కలిసి వెళ్లానని తెలిపింది. రహస్య ప్రదేశంలో అతడిని పెళ్లి చేసుకున్నట్టు వెల్లడించింది. తన తల్లిదండ్రుల నుండి తనకు ప్రాణహాని ఉందని వీడియోలో చెప్పుకొచ్చింది. అంతేకాకుండా తమకు రక్షణ కల్పించాలని పోలీసులను కోరింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *