Paritala sreeram : పవన్ కళ్యాణ్ గుండు మ్యాటర్ పై స్పందించిన పరిటాల శ్రీరామ్… ఏమన్నారంటే..?

కొన్ని వార్తలు ఎలా వస్తాయో ఎందుకు వస్తాయో చెప్పలేము. అలాంటి వార్తనే పవన్ కళ్యాణ్ గుండు విషయం. పవన్ కళ్యాణ్ గుండు చేసుకునే ఒక ఫోటో సోషల్ మీడియాలో ఎప్పుడూ వైరల్ అవుతూనే ఉంటుంది. అయితే ఓ భూ వివాదం విషయంలో పవన్ కళ్యాణ్ కు దివంగత నేత పరిటాల రవి గుండు కొట్టిచ్చాడు అని ప్రచారం కూడా జరిగింది.

 

అంతేకాకుండా ఏపీ మంత్రి రోజా సైతం ఓ సందర్భంలో పవన్ ను విమర్శిస్తూ గుండు ప్రస్తావనను తీసుకొచ్చారు. అయితే తాజాగా ఈ విషయంపై పరిటాల రవి కుమారుడు టిడిపి నేత పరిటాల శ్రీరామ్ స్పందించాడు. ఓ ఇంటర్వ్యూలో పరిటాల శ్రీరామ్ ను యాంకర్ పవన్ కళ్యాణ్ కు గుండు కొట్టించారు… అనే వార్తలో నిజం ఎంత…? అని ప్రశ్నించాడు. దానికి శ్రీరామ్ సమాధానం ఇస్తూ.. పవన్ కళ్యాణ్ మంచి నటుడు.. ఆయనకు సొసైటీ మీద కన్సర్న్ ఉంది.

 

నాయకుడు ఎదిగే క్రమంలో ఇలాంటి రూమర్లు వస్తూ ఉంటాయి. ఇదంతా సర్వసాధారణం అని అన్నారు. అంతేకాకుండా ఆరోపణల్లో ఎంతో కొంత నిజం ఉంటే వాటిపై స్పందించవచ్చు కానీ నిరాదారమైన ఆరోపాలు చేసినప్పుడు ఎలా స్పందిస్తామని పరిటాల శ్రీరామ్ అన్నారు. పవన్ కళ్యాణ్ ను తక్కువ చేసి చూపించడానికి ఇలాంటి రూమర్లు క్రియేట్ చేస్తున్నారని పరిటాల శ్రీరామ్ అసహనం వ్యక్తం చేశారు.

 

పవన్ కళ్యాణ్ తో తమకు మంచి సంబంధాలు ఉన్నాయని …వాళ్ళు ఎన్ని రూమర్లు క్రియేట్ చేసినా పవన్ కళ్యాణ్ అర్థం చేసుకోగలరు అని అన్నారు. పవన్ కళ్యాణ్ ను నెగిటివ్ గా చేయడానికి మాట్లాడే మాటలు తప్ప తన తండ్రి గుండు కొట్టించారనే వార్తల్లో ఎలాంటి నిజం లేదని పరిటాల శ్రీరామ్ కొట్టిపారేశారు. ఇప్పటికైనా ఇలాంటి ఆరోపణలకు పులిస్టాప్ పెట్టాలని పెట్టాలని శ్రీరామ్ హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *