PAWAN KALYAN : ప‌వ‌న్ క‌ల్యాణ్ కు ప‌గడ్బందీ సెక్యురిటీ..ఆర్మీ ఇంటిలిజ‌న్స్ నుండి ఎంత మంది వ‌చ్చారంటే..?

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ సినిమాల‌తో పాటూ రాజ‌కీయాల‌ను కూడా బ్యాలెన్స్ చేస్తున్నారు. దాంతో ప‌వ‌న్ క‌ల్యాణ్ త‌రచూ హైద‌రాబాద్ మ‌రియు ఏపీకి ప్ర‌యాణించాల్సి వ‌స్తోంది. అయితే ఇటీవ‌ల ప‌వ‌న్ క‌ల్యాణ్ ఇంటిముందు కొంద‌రు దుండ‌గులు అనుమాన‌స్ప‌దంగా రెక్కీ నిర్వ‌హించినట్టు వార్త‌లు వినిపించిన సంగ‌తి తెలిసిందే. దాంతో ప‌వ‌న్ క‌ల్యాణ్ సెక్యురిటీ విష‌యంలో అభిమానులు జ‌న‌సేన కార్య‌కర్త‌లు ఆందోళ‌న చెందుతున్నారు. మ‌రోవైపు రెక్కీ నిర్వహించ‌లేద‌ని పోలీసులు చెబుతున్నారు.

 

ఫ్యాన్స్ ప‌వ‌న్ ఇంటి ముందు చ‌క్క‌ర్లు కొట్టార‌ని అనుమానాస్ప‌ద వ్య‌క్తులు కాద‌ని సెల‌బ్రెటీ ఇల్లు కావ‌డంతో అలా చేసారేమోనని అంటున్నారు. కానీ పార్టీ శ్రేణులు మాత్రం దీనిని సులువుగా తీసుకోవ‌ద్ద‌ని..ప‌వ‌న్ క‌ల్యాణ్ కు త్రెడ్ ఉంద‌ని టెన్ష‌న్ ప‌డుతున్నారు. ఈ నేప‌థ్యంలో ప‌వన్ క‌ల్యాణ్ కు సెక్యురిటీని సైతం పెంచిన‌ట్టు తెలుస్తోంది. అంతే కాకుండా ఇండియ‌న్ ఆర్మీ ఇంటిలిజెన్స్ లో ప‌నిచేసి ఉద్యోగ‌విర‌మ‌ణ పొందిన 10 మంది సిబ్బందిని ప‌వ‌న్ క‌ల్యాణ్ సెక్యురిటీగా నియ‌మించుకున్నార‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *