MLC KAVITHA : జైల్లో పెడతాం అంటే పెట్టుకోండి…. బీజేపీ పై కవిత ఫైర్….!
ఢిల్లీ లిక్కర్ స్కాంలో నిందితుడు అమిత్ అరోరా రిమాండ్ రిపోర్టులో ఎమ్మెల్సీ కవిత పేరును ప్రస్తావించిన సంగతి తెలిసిందే. ఈ విషయం నిన్న బయటకు రాగా ప్రస్తుతం వార్తల్లో హాట్ టాపిక్ గా మారింది. అయితే తాజాగా ఎమ్మెల్సీ కవిత మీడియా సమావేశం ఏర్పాటు చేసి బిజెపి ప్రభుత్వంపై… ఈడి పై విమర్శల వర్షం కురిపించారు.
కవిత మాట్లాడుతూ…. నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చి ఎనిమిది సంవత్సరాలు అవుతోంది. ఈ సమయంలో 9 రాష్ట్రాల్లో ప్రజాస్వామ్య యుతంగా ఎన్నిక జరిగిన ఎనిమిది ప్రభుత్వాలను పడగొట్టి అడ్డదారిలో బిజెపి ప్రభుత్వాలను ఏర్పాటు చేశారని మండిపడ్డారు. అంతేకాకుండా ఏ రాష్ట్రంలో అయినా ఎన్నికలు రావడానికి ముందు మోడీ కంటే ఈడి ముందు వస్తున్నారు… ఈ విషయాన్ని మనం గమనిస్తున్నాం అని కవిత వ్యాఖ్యానించారు. నరేంద్ర మోడీ పాలనలో ప్రభుత్వాలను కూల్చే కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు.
తెలంగాణలో వచ్చే డిసెంబర్లో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి నరేంద్ర మోడీ కంటే ముందు ఈడి వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన మీద కానీ టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు మంత్రులపై కానీ వీడి దాడులు జరపడం సహజమని అన్నారు. ఈడి దాడులకు భయపడాల్సిన అవసరం లేదని…. సిబిఐ, ఈడి ప్రయోగించి అత్యంత చైతన్యవంతమైన తెలంగాణలో అధికారంలోకి రావాలనుకోవడం జరిగే పని కాదని కవిత కామెంట్స్ చేశారు. జైల్లో పెడతామంటే చేసేది ఏం లేదని జైల్లో పెట్టుకోవచ్చని భయపడే ప్రసక్తి లేదని కవిత కుండ బద్దలు కొట్టారు.