Ajith Abbas : “జీన్స్” మూవీ ని మిస్ చేసుకున్న అజిత్… అబ్బాస్… కారణం అదే..!

దేశం గర్వించదగ్గ గొప్ప దర్శకులలో ఒకరు అయినటువంటి శంకర్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. శంకర్ ఇప్పటికే ఎన్నో బ్లాక్ బాస్టర్ మూవీలకు దర్శకత్వం వహించి ఇండియాలోనే గొప్ప దర్శకుడుగా పేరు తెచ్చుకున్నాడు. ఇది ఇలా ఉంటే శంకర్ ప్రదర్శకత్వంలో తెరకెక్కిన జీన్స్ మూవీ ఏ రేంజ్ విజయం అందుకుందో మన అందరికీ తెలిసిందే. జీన్స్ మూవీలో ప్రశాంత్ హీరోగా నటించగా , ఐశ్వర్యారాయ్ హీరోయిన్ గా నటించింది. ఈ మూవీని ఆ కాలంలోనే శంకర్ భారీ బడ్జెట్ తో నిర్మించాడు.

 

ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ బ్లాక్ బస్టర్ విజయం సాధించి అద్భుతమైన కలెక్షన్లను రాబట్టింది. ఇది ఇలా ఉంటే మొదట దర్శకుడు శంకర్ ఈ మూవీని ప్రశాంత్ తో కాకుండా అబ్బాస్ లేదా అజిత్ తో తీయాలి అని అనుకున్నాడు. కాకపోతే ఆ ఇద్దరు కూడా జీన్స్ మూవీలో కొన్ని కారణాల వల్ల నటించలేకపోయారు. మరి జీన్స్ మూవీలో అజిత్ మరియు అబ్బాస్ లు ఎందుకు నటించలేకపోయారో తెలుసుకుందాం. దర్శకుడు శంకర్ “జీన్స్” మూవీ కథను మొదటగా అబ్బాస్ తో తీయాలి అని అనుకున్నాడు. అలాగే కథను అబ్బాస్ కు కథ ను వినిపించగా ఆ కథ అబ్బాస్ కు బాగా నచ్చినప్పటికీ అంతకుముందే ప్రేమదేశం మూవీ అద్భుతమైన విజయం సాధించడంతో చాలా సినిమాలకు అప్పటికే అబ్బాస్ ఓకే చెప్పి ఉన్నాడు.

 

దానితో ఈ సినిమాలో అబ్బాస్ నటించలేకపోయాడు. ఆ తర్వాత శంకర్ ఈ కథను అజిత్ కు వినిపించాడు. అజిత్ కు కూడా జీన్స్ మూవీ కథ సూపర్ గా నచ్చినప్పటికీ ఆయన కూడా ఇతర మూవీలతో బిజీగా ఉండడం వల్ల ఈ మూవీలో నటించలేకపోయాడు. ఆ తరువాత ప్రశాంత్ ను దర్శకుడు శంకర్ సంప్రదించగా ప్రశాంత్ “జీన్స్” మూవీకి ఓకే చెప్పాడు. అలా వీరిద్దరి కాంబినేషన్ లో జీన్స్ మూవీ తెరకెక్కి బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *