Surya kumar yadav : ఆ విషయంలో సూర్యకుమార్ చాలా మెరుగుపడాలి… వసిం జాఫర్..!

టీమిండియా క్రికెట్ అభిమానులకు సూర్య కుమార్ యాదవ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ మధ్యకాలంలో సూర్య కుమార్ యాదవ్ అద్భుతమైన ప్రదర్శనతో టీం ఇండియాకు ఎన్నో విజయాలను అందించాడు. ప్రస్తుతం సూర్య కుమార్ యాదవ్ టి 20 ఫార్మేట్ లో ప్రపంచంలోనే మొట్ట మొదటి స్థానంలో కొనసాగుతున్న విషయం మన అందరికీ తెలిసిందే.

 

అలాగే సూర్య కుమార్ యాదవ్ ఈ మధ్య కాలంలో టి 20 ఫార్మేట్ మ్యాచుల్ లలో నిలకడగా తన ప్రదర్శనను ఇస్తున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా టీం ఇండియా న్యూజిలాండ్ తో వన్డే సిరీస్ లో పాల్గొన్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ వన్డే సిరీస్ లో భాగంగా న్యూజిలాండ్ తో సూర్య కుమార్ యాదవ్ అవుట్ అయిన విధానంపై భారత మాజీ క్రికెటర్ వసీం జాఫర్ స్పందించాడు.

 

మాజీ క్రికెటర్ వసీం జాఫర్ న్యూజిలాండ్ వన్డే సిరీస్ లో సూర్య కుమార్ యాదవ్ అవుట్ అయిన విధానం గురించి తాజాగా స్పందిస్తూ … టి 20 మ్యాచ్ లో స్లీప్ ఫిల్డర్స్ ఉండరు కాబట్టి బతికిపోవచ్చు. ఈ విషయంలో సూర్య కుమార్ యాదవ్ మెరుగుపడాలి. లేకపోతే సూర్య కుమార్ యాదవ్ టెస్ట్ లు ఎలా ఆడుతాడో అనే అనుమానం వ్యక్తం అవుతుంది అని వసీం జాఫర్ తాజాగా అన్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *