తెలంగాణ రాష్ట్రంలో ఈడి మెరుపు దాడులు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మంత్రి మల్లారెడ్డి ఇంట్లో ఈడి సోదాలు నిర్వహించింది. ప్రస్తుతం మల్లారెడ్డి కుటుంబాన్ని ఈడి విచారిస్తోంది. ఇదిలా ఉండగానే టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ ను ఈడి విచారణకు పిలవడం హాట్ టాపిక్ గా మారింది. లైగర్ సినిమాలో పెట్టుబడులకు సంబంధించి విజయ్ దేవరకొండను ఈడి విచారణకు పిలిచింది.
ఈ నేపథ్యంలో బుధవారం సుమారు 12 గంటల పాటు ఎన్ఫోర్స్మెంట్ అధికారులు విజయ్ దేవరకొండ ను విచారించారు. ఉదయం ఎనిమిదిన్నర గంటలకు మొదలైన విచారణ రాత్రి 9 గంటల వరకు పూర్తయింది. ఈడి ఆఫీస్ కు విజయ్ దేవరకొండ రాగా 12 గంటల పాటు ఆయనను అధికారులు విచారించారు. విచారణ ముగిసిన అనంతరం విజయ్ దేవరకొండ మీడియాతో మాట్లాడారు… విచారణ పై ఆయన స్పందించారు.
పాపులారిటీ పెరుగుతున్నప్పుడు ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లు రావడం కామన్ అని చెప్పారు. తనను విచారణకు రావాలని అధికారులు నోటీసులు ఇవ్వడంతో విచారణకు వచ్చినట్టు చెప్పారు. బాధ్యతగల పౌరుడిగా అధికారులు అడిగిన ప్రశ్నలు అన్నింటికీ సమాధానాలు ఇచ్చానని అన్నారు. తనను మళ్ళీ రమ్మని పిలవలేదని స్పష్టం చేశారు.
ముఖేష్ గౌడ్.. పరిచయం అవసరం లేని పేరు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ తరపున హైదరాబాద్ నుంచి మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన…
ఫుల్ మూన్ మీడియా ప్రొడక్షన్స్ పతాకంపై ప్రొడక్షన్ నెం-1గా రూపొందుతోన్న చిత్రం `సౌండ్ పార్టీ`. వీజే సన్నీ, హ్రితిక శ్రీనివాస్…
సీనియర్ నటి జయలలిత సమర్పకులుగా వ్యవహిరిస్తూ ఓ కీలక పాత్రలో నటిస్తున్న చిత్రం `రుద్రంకోట`. ఏఆర్ కె విజువల్స్ పతాకంపై…
ఇప్పటివరకు విడుదల అయిన సినిమాలలో నైజాం ఏరియాలో విడుదల అయిన మొదటి రోజు అత్యధిక షేర్ కలక్షన్లను వసూలు చేసిన…
టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి మెగాస్టార్ చిరంజీవి తాజాగా వాల్తేరు వీరయ్య అనే మూవీలో హీరోగా…
టాలీవుడ్ ఇండస్ట్రీలో అదిరిపోయే రేంజ్ క్రేజ్ ను కలిగి ఉన్న సీనియర్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి మెగాస్టార్ చిరంజీవి…
This website uses cookies.